Saturday, April 25, 2015

1500 కి చేరిన నేపాల్ భూకంపం మృతులు...

ఖట్మండూ,ఏప్రిల్ 25; : నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. రాజధాని నగరం కాఠ్‌మాండూకు 77 కిలోమీటర్ల దూరంలో రిక్టర్‌ స్కేల్‌పై 7.9గా నమోదైన ఈ భూకంప తీవ్రతకు ఎత్త్తెన భవనాలు, చారిత్రక కట్టడాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల నుంచి భారీ సంఖ్యలో మృతదేహాలు బయటపడుతున్నాయి. మృతుల సంఖ్య 1500కు చేరినట్లు సమాచారం. కాఠ్‌మాండూ వీధులన్నీ ఆర్తనాదాలు, హాహాకారాలతో దద్దరిల్లుతున్నాయి. ఆసుపత్రులన్నీ క్షతగాత్రులతో పూర్తిగా నిండిపోయాయి. అపార ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. విద్యుత్తు, సమాచార, రవాణా సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఆ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. శనివారం ఉదయం 11.41 నిమిషాలకు సుమారుగా నిమిషం 8 సెకన్లపాటు భూమి కంపించినట్లు గుర్తించారు. భూప్రకంపనల కారణంగా ప్రజలు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. నేపాల్‌లో సంభవించిన భూకంప ప్రభావం భారత్‌, బంగ్లాదేశ్‌, మలేసియాల్లోనూ కన్పించింది.. కాగా భారీ భూకంపం నుంచి 25మంది తెలుగు యాత్రికులు సురక్షితంగా బయటపడ్డారు.  భారత ప్రధాని నరేంద్రమోదీ ఆ దేశ అధినేతలతో మాట్లాడారు. కావాల్సిన సహాయాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు. భారత్‌ నుంచి నాలుగు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాల్ని ఆ దేశానికి పంపింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...