Tuesday, January 6, 2015

ప్రపంచ కప్‌కు భారత జట్టు ఎంపిక...


ముంబై, జనవరి 6 : వరల్డ్‌ కప్‌కు 15 మందితో కూడిన భారత జట్టును సెలెక్టర్‌ కమిటీ ఎంపిక చేసింది. ముంబైలో సమావేశమైన సెలెక్టర్లు సంచలన నిర్ణయాలు ఏమీ తీసుకోలేదు. గత వరల్డ్‌ కప్‌ హీరో యువరాజ్‌ రంజీలో మెరిసినా సెలక్టర్లను ఆకర్షించలేకపోయారు. కెప్టెన్‌గా ధోనీ, వైస్‌ కెప్టెన్‌గా కోహ్లీ జట్టును ముందుండి నడపనున్నారు. రోహిత్‌, థావన్‌, రైనా, రహానే బ్యాటింగ్‌లో ప్రధాన పాత్ర పోషించనున్నారు.

ఎంపికైన భారత జట్టు : మహేంద్ర సింగ్‌ దోనీ, శేఖర్‌ థావన్‌, రోహిత్‌ శర్మ, రహానే, విరాట్‌ కోహ్లీ, సురేష్‌ రైనా, లంబటి రాయుడు, రవీంద్ర జడేజా, అశ్విన్‌, అక్తార్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ, ఇషాంత్‌ శర్మ, బిన్నీ, ఉమేష్‌ యాదవ్‌.
 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...