హైదరాబాద్,జనవరి 25: వైద్య ఆరోగ్య శాఖ ను నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి
తాటికొండ రాజయ్య తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజయ్య తన రాజీనామాను
గవర్నర్కు పంపారు. రాజయ్య రాజీనామాను గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. వైద్య
ఆరోగ్య శాఖను మంత్రి లక్ష్మారెడ్డికి తాత్కాలికంగా కేటాయించారు. రాజయ్య
స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రివర్గంలోకి వరంగల్ పార్లమెంట్
సభ్యుడు కడియం శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. రాష్ట్రంలో
స్వైన్ఫ్లూ విస్తరించడానికి కారణం వైద్యశాఖ నిర్లక్షమేనని , వైద్యశాఖ
మంత్రి రాజయ్య చేతగాని తనం వల్లే స్వైన్ఫ్లూతో ఇంతమంది మరణించారని
ముఖ్య్మంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాజయ్య మీడియాతో తన ఆవేదన
పంచుకున్నారు. రాజయ్య ఆవేదనకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలపై
కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయడం రాజయ్య రాజీనామా కు దారితీసినట్టు
కనబడుతోంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment