Monday, December 15, 2014

ఎ.పి. రాజధాని ప్రధాన రైల్వే టెర్మినల్ పై కసరత్తు

గుంటూరు, డిసెంబర్‌ 16;ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధానిలో ప్రయాణికుల అవసరాలు తీర్చేందుకు దక్షిణ మధ్య రైల్వే పూర్తిస్థాయిలో సి ద్ధంగా ఉందని ఆ సంస్థ జనరల్‌ మేనేజర్‌ ప్రదీప్‌కుమార్‌ శ్రీవాస్తవ తెలిపారు. గుంటూరు, విజయవాడల్లో ఏదో ఒకటి రాజధానికి ప్రధాన టెర్మినల్‌ అవుతుందని చెప్పారు. మంగళగిరి రైల్వేస్టేషన్‌ను ప్రధాన టెర్మినల్‌గా అభివృద్ధి చేసేందుకు అనువైన స్థలం అందుబాటులో లేదన్నారు. విజయవాడ, గుంటూరు రైల్వేస్టేషన్లతో పాటు ఈ రెండు నగరాల మధ్యన ఉన్న స్టేషన్లన్నింటిని అ ప్‌గ్రేడ్‌ చేస్తామని తెలిపారు. వచ్చే రైల్వేబడ్జెట్‌లో కేంద్రం తప్పక ఏపీకి ప్రాధాన్యం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...