Wednesday, December 3, 2014

సీబీఐ కొత్త డైరెక్టర్‌ అనిల్‌కుమార్‌ సిన్హా

న్యూఢిల్లీ, డిసెంబర్ 3;  కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కొత్త డైరెక్టర్‌గా 1979 బ్యాచ్‌ ఐ.పి.ఎస్‌. అధికారి అనిల్‌కుమార్‌ సిన్హా బుధవారం బాధ్యతలు చేపట్టారు. 58 ఏళ్ల సిన్హా- గత 21 నెలలుగా సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌గా ఉన్నారు. శారదా గ్రూపు సంస్థల కుంభకోణ దర్యాప్తును ఆయనే పర్యవేక్షించారు. సీబీఐ అధిపతిగా వరసగా మూడోసారి బిహార్‌కు చెందిన అధికారే బాధ్యతలు చేపట్టడం విశేషం. ఇదివరకు డైరెక్టర్లుగా వ్యవహరించిన రంజిత్‌ సిన్హా, ఎ.పి.సింగ్‌ కూడా బీహార్ కు చెందినవారే. ప్రతిష్ఠాత్మకమైన హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో చదువుకున్న అనిల్‌కుమార్‌ సిన్హా విలేకరులతో మాట్లాడుతూ , ప్రతిష్ఠాత్మకమైన దర్యాప్తు సంస్థకు అధిపతిగా వ్యవహరించే బాధ్యతను వినమ్రంగా స్వీకరిస్తున్నట్లు చెప్పారు. సంస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు తనకు తెలుసుననీ, తన బృందంతో కలిసి విలువల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...