చెన్నై, డిసెంబర్ 23: ప్రముఖ దక్షిణ భారతదేశ సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత.కె.బాలచందర్ ఈ సాయంత్రం చెన్నైలో మరణించారు. ఆయన పూర్తి పేరు కైలాసం బాల చందర్. 84 సంవత్సరాల బాల చందర్ ఎంజీఆర్ కథానాయకుడిగా నటించిన దైవతాయ్ చిత్రానికి సంభాషణల రచయితగా చలనచిత్ర రంగంలో ప్రవేశించారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో 100కు పైగా చిత్రాలను రూపొందించారు. రజనీకాంత్, కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ వంటి నటుల్ని చిత్రపరిశ్రమకు పరిచయం చేశారు. ఆయన చిత్రాలలో బొమ్మాబొరుసా, సత్తెకాలపు సత్తెయ్య, .మరో చరిత్ర, అంతులేని కధ, గుప్పెడు మనసు, ఇది కధ కాదు, సింధుభైరవి, రుద్రవీణ,కోకిలమ్మ బహుళ ప్రజాదరణ పొందాయి. భారత ప్రభుత్వం నుంచి దాదా సాహెబ్ ఫల్కే , పద్మశ్రీ తో పాటు మొత్తం 9 జాతీయ చలన చిత్ర అవార్డులు అందుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment