తిరుపతి,డిసెంబర్ 1; ఇకనుంచి పోస్టాఫీసులలో కూడా తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనం టిక్కెట్లు లభించనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్త్రాలలో కొన్ని ఎంపిక చేసిన తపాలా కార్యాలయాల్లో ఈ టిక్కెట్లు లభిస్తాయి. శ్రీవారి దర్శనానికి 3 వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్ల బుకింగ్ ను సోమవారం నుంచి ప్రారంభించారు . పైలెట్ ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోని ఐదు జిల్లాల్లోని తొమ్మిది తపాలా కార్యాలయాల్లో ఈ టిక్కెట్లు అందుబాటులో వుంటాయి. చిత్తూరు జిల్లా మదనపల్లె పోస్టాఫీసు, అక్కడి బజారు వీధిలోని సబ్ పోస్ట్ ఆఫీసు, విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, కర్నూలు జిల్లాలోని నంద్యాల, ఆదోని, వరంగల్ జిల్లాలోని జనగాం పోస్టాఫీస్, నర్సంపేట సబ్ ఆఫీస్, కృష్ణాజిల్లాలో గుడివాడ, నందిగామ హెడ్ పోస్టాఫీసుల్లో ఈ స్పెషల్ దర్శనం టిక్కెట్లను పొందవచ్చు. ఈ టిక్కెట్లను ప్రతి రోజూ టికెట్లను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జారీ చేస్తారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment