Friday, November 21, 2014

వచ్చే జులై 14 నుంచి 25 వరకు గోదావరి పుష్కరాలు

హైదరాబాద్‌,నవంబర్ 21; వచ్చే ఏడాది   జులై 14 నుంచి 25 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. జులై 14న ఉదయం 6.28 నిమిషాలకు పుష్కరాలకు ప్రారంభ ముహూర్తమని, ఈ ముహూర్తానికి తితిదే పంచాంగాన్ని ప్రామాణికంగా తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. పుష్కరాలకు గాను గోదావరి తీర ప్రాంతాల్లో  మొత్తం రూ. 900 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. డిసెంబరు నుంచి పనులు ప్రారంభిస్తామన్నారు. 256 ఘాట్లను అభివృద్ధి చేస్తామని, 12 రోజుల పాటు గోదావరి హారతుల కార్యక్రమం ఉంటుందని మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. రాజమండ్రి, కొవ్వూరులో గోదావరి హారతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...