Saturday, November 22, 2014

హుస్సేన్‌ సాగర్‌ ప్రక్షాళనకు 100 కోట్లు

హైదరాబాద్‌, నవంబర్‌ 22: హైదరాబాద్‌లో హుస్సేన్‌ సాగర్‌ ప్రక్షాళనకు తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు రూ. 100 కోట్లు కేటాయించారు. హుస్సేన్‌సాగర్‌ను యుద్ధప్రాతిపదికపై ప్రక్షాళనం చేసే లక్ష్యంతో కేసీఆర్‌ శనివారంనాడు ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హుస్సేన్‌ సాగర్‌లోకి మురుగు నీరు రాకుండా మళ్లింపు కాల్వల నిర్మాణాలకు టెండర్లు పిలవాలని కేసీఆర్‌ ఆదేశించారు. హుస్సేన్‌ సాగర్‌ ప్రక్షాళనకు తగిన ఏర్పాట్లు చేయడానికి వీలుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నాయకత్వాన ఒక ఉపసంఘాన్ని నియమించారు.హుస్సేన్‌ సాగర్‌ చుట్టూ 100 ఎకరాలలో ఆకాశ హర్మ్యాలు నిర్మించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కూడా కేసీఆర్‌ అధికారులను సూచించారు అయితే పర్యావరణానికి ఆటంకం కలుగకుండా, అలాగే సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్మాణాలు జరగాలని ఆయన అన్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...