నల్లొండ, అక్టోబర్ 17 : యాదగిరిగుట్టను మూడేళ్లలో తిరుమల మాదిరిగా అభివృద్ధి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వెల్లడించారు. ఆలయానికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తామని ఆయన అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన ముందుగా యాదగిరిగుట్ట లక్ష్మినరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదగిరి గుట్ల అభివృద్ధిపై సమీక్ష జరిపిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ పారిశ్రామిక వేత్తల సహకారంతో గుట్టను అభివృద్ధి చేస్తామని అన్నారు. ఆలయానికి స్వర్ణగోపురం కట్టిస్తామని చెప్పారు.
లక్ష్మీనరసింహస్వామి గర్భగుడి ఎత్తు పెంచుతామని, తిరుమల తరహాలో గుట్టపై కాజేజీలు నిర్మిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. యాదగిరిగుట్టపై ఆధ్యాత్మిక కేంద్రాలను నిర్మిస్తామని ఆయన అన్నారు. ఆలయంలో పనిచేస్తున్న 42 మంది ఎన్ఆర్ఎంలను రెగ్యులర్ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. గుట్ట చుట్టూ 2 వేల ఎకరాల భూమిని సేకరించి అభయారణ్యం, పవిత్ర విల్లాలు ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. గుట్టకు వాటర్ గ్రిడ్ ద్వారా మంచినీటి వసతి కల్పిస్తామని, 250 ఎకరాలలో జైనులు నిర్మించనున్న ఆలయానికి ప్రభుత్వం సహకరిస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు.
లక్ష్మీనరసింహస్వామి గర్భగుడి ఎత్తు పెంచుతామని, తిరుమల తరహాలో గుట్టపై కాజేజీలు నిర్మిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. యాదగిరిగుట్టపై ఆధ్యాత్మిక కేంద్రాలను నిర్మిస్తామని ఆయన అన్నారు. ఆలయంలో పనిచేస్తున్న 42 మంది ఎన్ఆర్ఎంలను రెగ్యులర్ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. గుట్ట చుట్టూ 2 వేల ఎకరాల భూమిని సేకరించి అభయారణ్యం, పవిత్ర విల్లాలు ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. గుట్టకు వాటర్ గ్రిడ్ ద్వారా మంచినీటి వసతి కల్పిస్తామని, 250 ఎకరాలలో జైనులు నిర్మించనున్న ఆలయానికి ప్రభుత్వం సహకరిస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు.
No comments:
Post a Comment