Tuesday, October 14, 2014

బోరు బావిలో పడిన చిన్నారి గిరిజ మృతి...


రంగారెడ్డి, అక్టోబర్‌ 14 : జిల్లాలోని మంచాలలో విషాదం నెలకొంది. బోరు బావిలో పడిన చిన్నారి గిరిజ మరణించింది. అయితే మృతదేహాన్ని బయటకు తీసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. మూడు రోజుల క్రితం చిన్నారి గిరిజ బోరుబావిలో పడిపోవడంతో బాలికను రక్షించేందుకు దాదాపు 48 గంటల పాటు 
సిబ్బంది ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బోరుబావిలో 45 అడుగుల లోతులో చిన్నారి ఉన్నట్లు గుర్తించారు. 45 అడుగుల సమాంతర కందకం తవ్వి గిరిజను బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...