విజయవాడ,అక్టోబర్ 14: ఆంధ్రప్రదేశ్లోని తుపాను ప్రభావిత విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో మూగబోయిన ఫోన్లు పూర్తిస్థాయిలో పనిచేయడానికి మరో వారం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం విశాఖ నగరంలో బీఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్లను పునరుద్ధరించడానికి అధికారులు యుద్ధప్రాతిపదికన పని చేస్తున్నారు. అవసరమైన కేబుల్స్, సామగ్రిని ఇతర ప్రాంతాల నుంచి విశాఖకు పంపిస్తున్నారు. ఈ పనుల పర్యవేక్షణకు హైదరాబాద్ నుంచి పలువురు ఉన్నతాధికారులు విశాఖపట్టణం వెళ్లారు. ఈ మూడు జిల్లాల్లో ఉన్న మొత్తం సెల్టవర్లలో సగానికి పైగా విరిగిపోయాయని విశ్వసనీయ సమాచారం. విశాఖ నగరంలో గాలుల తీవ్రతకు 80శాతం సెల్టవర్లు నేలకొరిగాయని అధికారులు చెబుతున్నారు. చిన్నపాటి మరమ్మతు అవసరమైన కొన్నింటిని బుధవారం సాయంత్రంలోగా మరమ్మతు చేసే అవకాశాలున్నాయి. తీవ్రంగా దెబ్బతిన్న వాటిని సరిచేయడానికి ఢిల్లీ నుంచి కొత్త పరికరాలు తెప్పించాల్సిన అవసరం ఉంది. దీనికి మరో వారం రోజులు పడుతుందని తెలిసింది.గ్రామీణ, మండల ప్రాంతాల్లో మరింత ఆలస్యం: మండల, గ్రామీణ ప్రాంతాల్లో ల్యాండ్లైన్లు, సెల్టవర్ల పునరుద్ధరణ మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment