డల్లాస్, అక్టోబర్ 14 : ఆంధ్రప్రదేశ్లో హుద్హుద్ తుపాన్ సృష్టించిన అల్లకల్లోలంపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) స్పందించింది. సీఎం సహాయ నిధికి లక్ష డాలర్ల ప్రాథమిక విరాళం ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తానా సెక్రటరీ సతీష్ వేమనతో కలిసి లక్ష డాలర్ల విరాళాన్ని చెక్కు రూపంలో అందజేయనున్నట్లు తానా అధ్యక్షుడు మోహన్ నన్నపపేని తెలిపారు. చిత్ర పరిశ్రమ విరాళాలు
హుద్హుద్ తుపాన్ బాధితులను ఆదుకునేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందుకు వచ్చింది. జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్ రూ. 50 లక్షలు, నిర్మాతల మండలి రూ. 25 లక్షలు, ప్రిన్స్ మహేష్బాబు రూ. 25 లక్షలు, జూనియర్ ఎన్టీఆర్ రూ. 20 లక్షలు, అల్లు అర్జున్ రూ. 20 లక్షలు, రామ్చరణ్ తేజా రూ. 10 లక్షలు, సీఎం రిలీఫ్ ఫండ్కు మరో రూ. 5 లక్షలు సాయంగా ప్రకటించారు. సూపర్ స్టార్ కృష్ణ రూ. 15 లక్షలు, విజయనిర్మల రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు. నటుడు సంపూర్నేశ్ బాబు రు .లక్ష విరాళం ప్రకటించారు
No comments:
Post a Comment