ముంబై,అక్టోబర్ 15 : మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా భాజపా అవతరించనున్నట్టు ఏబీపీ ఎగ్జిట్పోల్ వెల్లడించింది. మొత్తం 288 అసెంబ్లీస్థానాలున్న మహారాష్ట్రలో భాజపాకు పూర్తి మెజార్టీ రాకపోయినా ఎక్కువస్థానాలు సాధించవచ్చని తెలిపింది. భాజపాకు 127, శివసేనకు 77, కాంగ్రెస్ 40, ఎన్సీపీ 34 , ఎంఎన్ఎస్ 5, ఇతరులకు 5 స్థానాలు రావచ్చని ఎగ్జిట్పోల్స్ పేర్కొన్నాయి.
ఇక టైమ్స్నౌ-సీ ఓటర్స్ ఎగ్జిట్పోల్ ప్రకారం
మహారాష్ట్రలో మొత్తం స్థానాలు-288 : బీజేపీ-129, శివసేన-56, కాంగ్రెస్-43, ఎన్సీపీ-36, ఎంఎన్ఎస్-12, ఇతరులు-12హర్యానాలో మొత్తం స్థానాలు-90: బీజేపీ-37, ఐఎన్ఎల్డీ-28, కాంగ్రెస్- 15, హెచ్జేసీ-06, ఇతరులు-04 వస్తాయని అంచనా.
No comments:
Post a Comment