Wednesday, October 15, 2014

ప్రముఖ రచయత్రి తురగా జానకి రాణి కన్నుమూత

'
హైదరాబాద్, అక్టోబర్ 15; 'రేడియో అక్కయ్య'గా ప్రసిద్ధి గాంచిన ప్రముఖ రచయిత్రి తురగా జానకిరాణి బుధవారం సాయంత్రం పంజాగుట్టలోని ఆమె నివాసంలో కన్నుమూశారు. జానకిరాణి స్వస్థలం మచిలీపట్నం సమీపంలోని మందపాకల గ్రామం. ప్రముఖ హాస్యరచయిత, పాత్రికేయుడు తురగా కృష్ణమోహన్‌రావు సహధర్మచారిణి. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో స్వర్ణపతకాలు, నిజాం కళాశాలలో ఏంఏ ఎకనామిక్స్‌్‌ డిగ్రీ, మద్రాసు నుంచి భరతనాట్యం, సామాజిక సేవా రంగంలో డిప్లొమాలు పొందారు. సెంట్రల్‌ సోషల్‌ వెల్ఫేర్‌ బోర్డులో సంక్షేమ అధికారిగా, 1975-1994 సంవత్సరాల్లో  ఆకాశవాణిలొ నిర్మాతగా, సహాయ సంచాలకులుగా పని చేసారు. అనే విభిన్నమైన కార్యక్రమాలను నిర్వహించారు. రచయిత్రిగా మూడు కథా సంకలనాలు, రెండు నవలలు, రేడియో నాటకాల సంకలనం, 'చేతకాని నటి' కవితా సంకలనం, 'మా తాతయ్య చలం' లేఖా సాహిత్యం, అయిదు అనువాద గ్రంథాలు, 35 పిల్లల పుస్తకాలు, అనేక వ్యాసాలు మరి కొన్ని ప్రక్రియల్లో రచనలు చేశారు. నాలుగు సార్లు ఆకాశవాణి జాతీయ స్థాయి పురస్కారాలను అందుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలు రెండుసార్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం, పింగళి వెంకయ్య స్మారక సత్కారం, అరవిందమ్మ మాతృమూర్తి అవార్డు, సుశీల నారాయణరెడ్డి సాహితీ పురస్కారం, ఆంధ్ర సారస్వత పరిషత్తులో పరిణతవాణి గౌరవం వంటి అనేక పురస్కారాలు, సత్కారాలు అందుకున్నారు. సంఘసేవకురాలిగా ఆంధ్ర మహిళా సభ, ఆంధ్ర యువతీ మండలి, శ్రామిక విద్యా పీఠం సంస్థల్లో ప్రముఖ పాత్రను పోషించారు. సీడ్‌ సంస్థల్లో కార్యనిర్వాహక వర్గ సభ్యురాలుగా, మహిళా ఫెడరేషన్‌లో సలహాదారుగా, నవ్య సాహితీ సమితి ఉపాధ్యక్షురాలిగా, లోక్‌సత్తాలో క్రియాశీలక సభ్యురాలుగా అనేక సేవలను అందించారు. దేశ, విదేశాల్లో దాదాపు యాభై వరకు సదస్సుల్లో పాల్గొన్న ఘనత ఆమెకే దక్కింది. అలాగే యూనిసెఫ్‌, సేవ్‌ ది చిల్డ్రన్‌ యూకే, ఎన్‌సీఈఆర్‌టీ వంటి సంస్థలకు కమ్యూనికేషన్‌ సలహాదారు, ప్రచార సామగ్రి రూపకర్తగా పేరొందారు

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...