Tuesday, October 21, 2014

శ్రీలంకతో తొలి వన్డేకు భారత జట్టు ఖరారు.

న్యూఢిల్లీ ,అక్టోబర్ 21; నవంబర్  2 నుంచి భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగే సిరీస్‌లో తొలి వన్డేకు బీసీసీఐ భారత జట్టును ఖరారు  చేసింది. శ్రీలంక సిరీస్ లో తొలి మూడు వన్డేలకు మహేంద్రసింగ్ ధోనీకి సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ధోనీ స్థానంలో వికెట్ కీపర్ గా సాహాను తీసుకున్నారు. కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, రహానే, రైనా, అంబటి రాయుడు, సాహా, అశ్విన్, జడేజా, షమీ, ఉమేష్, ఇషాంత్, అమిత్, అజయ్, ఆరోన్, అక్షర్‌లను బీసీసీఐ ఎంపిక చేసింది. 
 కటక్, హైదరాబాద్, రాంచీ, కోల్‌కత, అహ్మదాబాదు లలో వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...