Wednesday, October 22, 2014

వచ్చే మే నాటికి ఎబోలా వ్యాక్సిన్...


న్యూ యార్క్, అక్టోబర్ 22;  ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఎబోలా వైరస్‌ నుంచి రక్షణ కోసం ప్రముఖ సంస్థ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వేక్సిన్‌లను సిద్ధం చేసింది. వచ్చే మే నాటికి 2,50,000 వ్యాక్సిన్‌లను అందుబాటులోకి తెస్తామని 2015 చివరి నాటికి ఒక మిలియన్‌ వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేస్తామని తెలిపింది. గత కొంత కాలంగా ఈ వైరస్‌తో వేల మంది మృత్యువాత పడటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాక్సిన్‌లను తెచ్చే దిశగా దృష్టి సారించింది. యూఎస్‌ నేషనల్‌ ఇన్సిటిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ ఇచ్చిన సాంకేతిక సహకారంతో డెన్మార్క్‌కు చెందిన బావరిన్‌ నోర్డిక్‌ సంస్థ ఈ వ్యాక్సిన్‌ తయారు చేసింది. మొదట దీన్ని కోతులపై ప్రయోగించి ఎబోలా వైరస్‌ను నిరోధించడంలో మంచి ఫలితాలను ఇస్తోందని ధ్రువీకరించారు. దీంతో వ్యాక్సిన్ల తయారీమొదలయింది. జాన్సన్‌ అండ్‌ జన్సన్‌ సంస్థ ఈ వాక్సిన్‌ను తయారు చేయడం మొదలు పెట్టింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...