Thursday, October 16, 2014

వంశధార, నాగావళి అనుసంధానం ....


విజయవాడ, అక్టోబర్ 16; శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి నదులను అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని ఏపీ రాష్ట్ర మంత్రుల బృందం పేర్కొంది. గురువారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలో ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి ఎన్‌.చినరాజప్ప, నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో నాగావళి, వంశధార నదుల నీటి సద్వినియోగానికి ఆ రెండింటిని అనుసంధానం చేస్తామన్నారు. వంశధార పరిధిలోని రిజర్వాయర్‌ నుంచి నాగావళి ఎగువ ప్రాంతమైన నారాయణపురం ఆనకట్ట వరకు అనుసంధానం చేయడం వల్ల జలవనరులు వినియోగంలోకి వస్తాయన్నారు. దీనిపై నిపుణుల కమిటీని నియమించి త్వరలో నివేదిక తెప్పించుకుంటామన్నారు. దీనికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం లభించిందని వివరించారు.వచ్చే రెండేళ్లలో శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన నదులైన వంశధార, నాగావళి నదులకు కరకట్టల నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రణాళికలు  సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...