Friday, September 19, 2014

మేందలిన్ శ్రీనివాస్ మృతి...

విజయవాడ, సెప్టెంబర్ 19: 
ప్రముఖ మేండలిన్ వాయిద్య విద్వాంసుడు మేండలిన్ శ్రీనివాస్ మరణించారు. ఆయన వయసు 45 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మేండలిన్ శ్రీనివాస్ శుక్రవారం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన ఉప్పలపు శ్రీనివాస్ మేండలిన్ విద్వాంసుడిగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచారు. ప్రపంచంలోని అనేక దేశాలలో ఆయన మేండలిన్ ప్రదర్శనలు ఇచ్చారు. మేండలిన్తో జీవితం పెనవేసుకున్న ఆయన పేరు కూడా మేండలిన్ శ్రీనివాస్గా మారిపోయింది. బాల్యం నుంచే మేండలిన్ విద్వాంసుడిగా ఎనలేని కీర్తి ప్రతిష్టలు ఆయన సంపాదించారు. ఆరు సంవత్సరాల వయసున్నప్పటి నుంచే ఆయన మేండలిన్ మీద స్వరాలు పలికించడం ప్రారంభించారు. భారత ప్రభుత్వం ఆయనని 1998 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 2010 సంవత్సరంలో ఆయనకు సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది. మేండలిన్ శ్రీనివాస్కి శ్రీ అనే యువతితో పెళ్ళయింది. అయితే ఆమె తనను మానసికంగా ఎంతో హింసిస్తోందని, ఆమె నుంచి తనకు విడాకులు కావాలని మేండలిన్ శ్రీనివాస్ కోర్టుకు ఎక్కారు. కోర్టు వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. 


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...