హైదరాబాద్, సెప్టెంబర్ 22; తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించి జారీ చేసిన ‘ఫాస్ట్’ పథకం జీవోను హైకోర్టు తప్పు పట్టింది. తెలంగాణ ప్రభుత్వం ఈ జీవోను జారీ చేయడం రాజ్యాంగపరంగా ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. జాతీయ సమగ్రతను దెబ్బ తీసేలా ఈ జీవో వుందని హైకోర్టు ఆగ్రహించింది. ఈ జీవో విషయంలో ప్రభుత్వం పునరాలోచించుకోవాలని సూచించింది. తెలంగాణ ఎక్కడో ప్రత్యేకంగా లేదని, తెలంగాణ కూడా భారతదేశంలో అంతర్భాగమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. తెలంగాణ ప్రభుత్వ ‘ఫాస్ట్’ జీవోను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రులు పితాని, డొక్కా కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ విషయం మీద కౌంటర్ అఫిడవిట్ని దాఖలు చేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.కేసును ఆరు వారాల తర్వాతకి వాయిదా వేసింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment