Monday, September 22, 2014

ఫాస్ట్ పధకం పై కె.సి.ఆర్. సర్కార్ కు చుక్కెదురు.

హైదరాబాద్, సెప్టెంబర్ 22;  తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించి జారీ చేసిన ‘ఫాస్ట్’ పథకం జీవోను హైకోర్టు తప్పు పట్టింది. తెలంగాణ ప్రభుత్వం ఈ జీవోను జారీ చేయడం రాజ్యాంగపరంగా ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. జాతీయ సమగ్రతను దెబ్బ తీసేలా ఈ జీవో వుందని హైకోర్టు ఆగ్రహించింది. ఈ జీవో విషయంలో ప్రభుత్వం పునరాలోచించుకోవాలని సూచించింది. తెలంగాణ ఎక్కడో ప్రత్యేకంగా లేదని, తెలంగాణ కూడా భారతదేశంలో అంతర్భాగమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. తెలంగాణ ప్రభుత్వ ‘ఫాస్ట్’ జీవోను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రులు పితాని, డొక్కా కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ విషయం మీద కౌంటర్ అఫిడవిట్ని దాఖలు చేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.కేసును ఆరు వారాల తర్వాతకి వాయిదా వేసింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...