మెదక్, సెప్టెంబర్ 16 : మెదక్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి కొత్తప్రభాకర్రెడ్డి 3,61,277 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డిపై విజయం సాధించారు. రెండో స్థానంలో కాంగ్రెస్, మూడవ స్థానంలో బీజేపీ పార్టీలు నిలిచాయి.
మొదటి నుంచి మెదక్ ఉప ఎన్నికల కౌంటింగ్ టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగింది. కౌంటింగ్ ప్రారంభం నుంచే ప్రతీ రౌండ్లోనూ 20 నుంచి 30వేల ఆధిక్యంతో టీఆర్ఎస్ దూసుకెళ్తూ వచ్చింది. మెదక్లో మొత్తం 10,46,080 ఓట్లు పోలయ్యాయి. టీఆర్ఎస్కు 5,71,800, కాంగ్రెస్కు 2,10,523, బీజేపీకి 1,86,344ఓట్లు లభించాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి విజయంతో పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.
No comments:
Post a Comment