Thursday, August 14, 2014

రుణ మాఫీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు ....రైతులకు లక్షన్నర , డ్వాక్రా సంఘాలకు లక్ష చొప్పున మాపీ

హైదరాబాద్, ఆగష్టు 14 : రుణ మాఫీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు రూ. లక్షన్నర చొప్పున, డ్వాక్రా సంఘాలకు రూ. లక్ష చొప్పున మాపీ చేసేందుకు ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేసింది. ఆర్థిక శాఖ జీవో నెం. 174 లో రుణ మాఫీ ఏ విధంగా అమలు చేయాలనేది  పేర్కొన్నారు.  ఒక రైతు కుటుంబానికి రూ. లక్షన్నర లబ్ది చేకూర్చే విధంగా మాఫీ చేయనున్నారు. అదే విధంగా డ్వాక్రా సంఘాలకు రూ. లక్ష వరకు రుణ మాఫీ చేయాలనే నిర్ణయాన్ని ఆగస్టు 2న ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని అమలు చేయడానికి విధివిధానాలు, కమిటీలో ఎవరు ఉండాలి, ఏ విధంగా చేయాలి... అర్హులను గుర్తించి అమలు చేసే విధానాన్ని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. దీనికి సంబంధించి ఒక కమిటీని  ప్రభుత్వం తరఫు నుంచి కొందరు, బ్యాంకర్ల తరఫు నుంచి కొందరు ప్రతినిధులతో ఏర్పాటు చేస్తారిఉ.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...