Thursday, August 14, 2014

భారతీయ విలువలు ప్రపంచానికి మార్గదర్శకం...రాష్ట్రపతి

న్యూఢిల్లీ, ఆగస్టు 14:  అసహనం, హింసాకాండను ప్రోత్సహించడమంటే ప్రజాస్వామ్య స్ఫూర్తిని పూర్తిగా మోసగించడమేనని, హింసాకాండను రెచ్చగొట్టే వైఖరి గర్హనీయమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. 68వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన దేశప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ, ప్రాచీన నాగరికతతో కూడుకుని ఉన్నప్పటికీ భారత్, అధునాతన దేశమని, అధునాతన కలలకు నిలయమని రాష్ట్రపతి అన్నారు.
విద్వేషపూరిత ప్రసంగాలతో ప్రజలను రెచ్చగొట్టాలని భావించేవారికి భారతీయ విలువలు, రాజకీయ ఒరవడి అర్థంకావని,  శాంతియుత పరిస్థితులు లేకుండా ఆర్థిక, సామాజిక అభివృద్ధి సాధించడం కష్టతరమన్నది భారతీయులకు తెలుసునని అన్నారు. ఆసియా, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో మిలిటెంట్లు మతోన్మాద సిద్ధాంతాలతో వివిధ దేశాల భౌగోళిక హద్దుల రేఖాచిత్రాలనే మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్రపతి ప్రస్తావించారు. తీవ్రవాదాన్ని, తీవ్రవాద కుట్రలను తీవ్రంగా వ్యతిరేకించాలని భారతీయ విలువలు చాటిచెబుతున్నాయని, ప్రజాస్వామ్యానికి భారత్ మార్గదర్శకమైనదని రాష్ట్రపతి అన్నారు. 12వ పంచవర్ష ప్రణాళిక ముగిసేలోగా 80శాతం అక్షరాస్యత సాధించాలని, 2019లో జరిగే మహాత్మాగాంధీ 150వ  జయంతినాటికి పరిశుద్ధ భారత్ సాధించాలన్న  ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు అభినందనీయమని రాష్ట్రపతి అన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...