Friday, August 15, 2014

మోడీ ‘మేడ్ ఇన్ ఇండియా’ నినాదం....వస్తువుల ఉత్పత్తి ద్వారా ముందుకు కదలాలని పిలుపు

 పేదలకు ‘జన ధన యోజన’ పథకం
న్యూఢిల్లీ, ఆగస్టు 15 : మేక్ ఇన్ ఇండియా అనేది ఇక నుంచి మన విజయ నినాదం కావాలని ప్రధాన మంత్రి మోదీ పిలుపు ఇచ్చారు. దేశ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తూ ప్రధాని మాట్లాడుతూ, ఏ రంగంలోనైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావచ్చునని, వస్తువుల ఉత్పత్తితో మాత్రమే దేశ ఆర్థిక ప్రగతి సాధ్యమని ఆయన చెప్పారు. ఇకనుంచి దిగుమతులపై ఖర్చును తగ్గించాలని, మనం అన్ని వస్తువులనూ ఉత్పత్తి చేయడం ద్వారా ముందుకు కదలాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఉత్పత్తే దేశాభివృద్ధికి మూలం అని ఆయన వివరించారుదేశంలో ప్రతి పేదవానికీ ఒక బ్యాంకు ఖాతా ఉండేటట్టు చేయాలని,  ప్రతి పౌరునికీ డెబిట్ కార్డు ఉండాలని అన్నారు.  పేదలకు లక్ష రూపాయలతో జీవిత బీమా కల్పిస్తామని చెప్పారు. 2016 కల్లా ప్రతి నియోజకవర్గంలోనూ ఒక నమూనా గ్రామాన్ని తీర్చిదిద్దాలని, 2019 కల్లా దేశం నలుమూలలూ పరిశుభ్రంగా ఉండాలని ఆకాంక్షించారు.  తాను ప్రధానమంత్రిగా గాక ప్రదాన సేవక్‌గా ప్రజల  ముందుకు వచ్చానన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను కొత్తపుంతలు తొక్కించాలని చెబుతూ ప్రణాళికా సంఘం పాత్ర ఇక ముగిసిందని ఆయన చెప్పారు. ప్రణాళికా సంఘం పాతబడిపోయిందని, దాన్ని మూలపడేయాలని, దాని స్థానంలో దేశ అవసరాలకు అనుగుణంగా కొత్త సంస్థను ఏర్పాటు చేసుకుందామని ఆయన వెల్లడించారు. ఒక పేదవాడు ఎర్రకోటపై భారత దేశ త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేయగలగడం అంటేనే మన ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో చెబుతుందని ఆయన ఆనందంగా చెప్పారు. దేశాబివృద్ధికి పెద్ద పెద్ద ఘనకార్యాలు ఏమీ చేయనక్కరలేదు చిన్న చిన్న పథకాలు చాలు అని ఆయన అన్నారు. దేశంలోని ప్రతి గ్రామానికీ డిజిటల్ కనెక్టివిటీ తీసుకురావాలని, అలాగే సాంకేతిక ప్రగతిఫలాలు దేశ ప్రగతికి దోహదం చేయాలనీ ఆయన పిలుపునిచ్చారు. దేశంలో  మాన భంగాలు జరగడం అంటే అది జాతికే అవమానం అని ఆయన అంటూ తల్లిదండ్రులు ఆడ పిల్లలను కాదు, మగ పిల్లలను అదుపుచేయాలని, ఇది తల్లిదండ్రుల బాధ్యత అని ఆయన చెప్పారు. దేశంలో ప్రతి పాఠశాలలోనూ మన ఆడపిల్లలకోసం మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.   పార్లమెంటులో సంఖ్యా బలంతో కాకుండా ఏకాభిప్రాయంతో దేశాన్ని నడిపిస్తాను.. ప్రతిపక్షాన్ని కలుపుకుని ముందుకుపోతాం’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.  తాను మాట్లాడే పోడియానికి బులెట్ ప్రూఫ్ రక్షణ కవచాన్ని మోడీ తిరస్కరించటం విశేషం. దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రధానమంత్రులు ఎర్రకోట నుంచి బులెట్ ప్రూఫ్ అద్దాల గది నుంచి ప్రసంగిస్తుండగా.. మోడీ తొలిసారి ఆ రక్షణ లేకుండా ప్రసంగించారు.
మోడీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ...
    ప్రణాళికాసంఘాన్ని రద్దు చేస్తాం.. సరికొత్త వ్యవస్థను నెలకొల్పుతాం
    పేదలకు ‘జన ధన యోజన’ పథకంతో బ్యాంకు ఖాతాలు తెరిపిస్తాం
    ఎంపీల ద్వారా ‘ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ పథకం’ అమలుచేస్తాం
    యువత నైపుణ్యాల కోసం ‘స్కిల్ ఇండియా’ ఉద్యమాన్ని ప్రారంభిస్తాం
    పరిశుభ్రమైన భారత్ కోసం అక్టోబర్ 2 నుంచి ‘స్వచ్ఛ భారత్’ పథకం
    తొలి ఏడాది పాఠశాలల్లో బాలబాలికలకు వేర్వేరు మరుగుదొడ్ల నిర్మాణం
    మతం, కులం ప్రాతిపదికగా హింస ఇంకెన్నాళ్లు? పదేళ్ల పాటు వదిలేద్దాం
    ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే దాన్ని నాణ్యతకు మారుపేరుగా నిలపాలి
    పౌరులను సాధికారం చేయడానికి ‘డిజిటల్ ఇండియా’ను రూపొందిస్తాం
    ప్రభుత్వంలో శాఖల మధ్య అంతరాలనే గోడలు బద్దలుకొడుతున్నా

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...