హైదరాబాద్, జూలై 28 : ఎంసెట్ కౌన్సెలింగ్పై సందిగ్ధం తొలగిపోయింది. ఈనెల 30న ఇంజినీరింగ్ కౌన్సెలింగ్కు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆగస్టు 7వ తేదీ నుంచి విద్యార్థుల సర్టిఫికేట్ల పరిశీలన జరుగుతందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాల్రెడ్డి తెలిపారు. సుప్రీం కోర్టు వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని అలాగే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈనెల 30న ఇంజినీరింగ్ కౌన్సెలింగ్కు నోటిఫికేషన్ జారీ చేస్తున్నామని, ఆగస్టు 7వ తేదీ నుంచి విద్యార్థుల సర్టిపికేట్లను పరిశీలించాలని నిర్ణయించినట్లు వేణుగోపాల్రెడ్డి చెప్పారు. ఇప్పటికే కౌన్సెలింగ్ ఆలస్యం అయినందున రెండు రాష్ట్రాల విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని.. ఇంకా ఆలస్యం చేస్తే రెండు రాష్ట్రాల కాలేజీల్లో విద్యార్థులు లేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆయన వెల్లడించారు. సర్టిఫికేట్ పరిశీలనఆగస్టు 7న ప్రారంభిస్తే సుమారు 18, 20 రోజులు పడుతుందని, ఈ లోపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు విద్యార్థుల ఫీజు రిఇంబర్స్మెంట్పై నిర్ణయం తీసుకుంటే విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆయన రెండు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. కాగా దీనికి సంబంధించి ఆగస్టు 4న సుప్రీం కోర్టులో విచారణ జరగనున్న విషయం తెలిసిందే. ఆ రోజు కోర్టు తీర్పు అనుకూలంగా రావచ్చునని వేణుగోపాల్రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment