కాలిఫోర్నియా, జూలై 28 : అమెరికాలో కాలిఫోర్నియాలోని మొసెమైట్ నేషనల్ పార్క్ ప్రాంతంలో శుక్రవారం ప్రారంభమైన కార్చిచ్చు గంటగంటకీ పెరుగుతోంది. ఇప్పటికే 13 ఇళ్లను భస్మీపటలం చేసిన ఈ కార్చిచ్చు అమడోర్, ఎల్ డొరాడో ప్రాంతాలకు విస్తరిస్తోంది. దాదాపు రెండు వెల మంది సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. మంటలు శాక్రమెంటో వైపు విస్తరిస్తున్నట్లు తెలుస్తున్నది. పాలకార్లు సేకరిస్తున్న ఒక వ్యక్తి అటవీ ప్రాంతం సమీపాన పార్క్ చేసిన 13 కార్లు ఇప్పటికే అగ్నికి ఆహుతి అయ్యాయి. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న ఈ అగ్నికిలలు కాలిఫోర్నియా అటవీ ప్రాంతాన్ని దగ్ధం చేస్తున్నాయి. ఇప్పటివరకు ఆరు చదరపు మెళ్ల అటవీ ప్రాంతం మంటలకు మాడి మసైంది. అటవీ ప్రాంతంలో ఒక ఇల్లు దగ్ధమైంది. దీని ప్రభావంతో ఆ ప్రాంతం పొగ, దుమ్ముతో నిండిపోయింది. ఆకాశమంతా ఎర్రగా మారిపోయింది. విమానాల సాయంతో మంటలను ఆర్పుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా చుట్టు పక్కల ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment