Monday, July 14, 2014

రాజ్య సభలో కూడా పోలవరం బిల్లు ఆమోదం

న్యూఢిల్లీ, జులై 14 : పోలవరం బిల్లును రాజ్యసభ కూడా ఆమోదించింది. తెలంగాణ రాష్ట్ర సమితి నేత, రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. సోమవారం మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పోలవరం బిల్లును రాజ్య సభలో ప్రవేశపెట్టారు. తెలంగాణకు మద్దతుగా టీఆర్ఎస్, టీ. కాంగ్రెస్, ఛత్తీస్‌గడ్, ఒడిషా రాజ్యసభ సభ్యులు సభలో బిల్లును వ్యతిరేకిస్తూ... తమ వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్‌కు మద్దతుగా ఏపీ కాంగ్రెస్ ఎంపీలు జైరాం రమేష్, కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలం, టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌లు తమ వాదనలు వినిపించారు. సుదీర్ఘ వాదనల అనంతరం బిల్లు ఆమోదం పొందింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...