హైదరాబాద్, జులై 3 : తెలంగాణా రాష్ర్టంలో చేపట్టే భూ సేకరణలో పారదర్శకత, నష్ట పరిహా రం చెల్లింపు, పునరావాస కార్యక్రమాలకు అనుసరించాల్సిన విధానంపై అధ్యయనానికి ప్రభుత్వం ఐదుగురు మంత్రులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అధ్యక్షునిగా ఏర్పాటైన ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు ఈటెల రాజేందర్, హరీశ్ రావు, తారక రామారావు, జోగు రామన్న ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ఎన్జీవోల భూముల వ్యవహారం అధికారులే చూసుకుంటున్నారని తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ స్పష్టం చేశారు. భూముల వ్యవహారంలో చట్టప్రకారమే నడుచుకుంటామని తెలిపారు. భూముల వ్యవహారంలో తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిసస్తుందని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ భూములు వ్యవహారంపై ఈ నెల 7వ తేదీన ఉన్నతాధికారులతో సమీక్షిస్తామని మహమూడ్ అలీ వెల్లడించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment