హైదరాబాద్, జూన్ 24 : ఆర్బీఐ అనుమతి లేకపోతే రుణ మాఫీ కష్టమంటున్న చంద్రబాబు ఎన్నికల ముందు ఈ మాట ఎందుకు చెప్పలేకపోయారని విపక్ష నేత వైఎస్ జగన్ మంగళవారం శాసన సభలో ప్రశ్నించారు. రైతుల పరిస్థితి దారుణంగా ఉందని జగన్ అన్నారు. ఖరీఫ్ సీజన్ మొదలైందని పాత రుణాలు కడితేనే కొత్త రుణాలు ఇస్తామని బ్యాంకర్లు చెబుతున్నారని, రైతులకు నోటీసులు కూడా వస్తున్నాయని ఆయన చెప్పారు. ఎప్పటి నుంచి రైతు రుణమాఫీ వర్తిస్తుందో క్లారిటీ లేదని...కేంద్రం, ఆర్బీఐ సహాయం అవసరమంటూ కొత్త మాట వినిపిస్తున్నారని జగన్ అన్నారు. జాబ్ అంటే ప్రభుత్వ ఉద్యోగమన్న భావన ప్రజల్లో ఉందని, ఇప్పుడు ఉద్యోగాల మాటే లేదని ఆయన విమర్శించారు. నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి అమలు అవుతుందో చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్తో తమకు సంబంధం అంటగడుతున్న వారుకిరణ్ ప్రభుత్వాన్ని కాపాడలేదా? అని జగన్ ప్రశ్నించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ తాము రైతు రుణ మాఫీ చేసి తీరతామని స్పష్టం చేశారు. రైతుల రుణాలు మాఫీ చేయవద్దని ఆనాడు వైఎస్ కేంద్రానికి సూచించారని అన్నారు. రుణమాఫీపై తమకు పూర్తి క్లారిటీ ఉందని, ప్రజల భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని తేల్చిచెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment