Sunday, January 19, 2014

ఓటమితో ఐదు వన్ డేల సీరీస్ ను ప్రారంభించిన టీమిండియా..

నేపియర్, జనవరి 19 : భారత్-న్యూజిలాండ్  మద్య  ఐదు వన్ డేల సీరీస్ లో భాగంగా నేపియర్‌లో ఆదివారం జరిగిన తొలి వన్డేలో టీం ఇండియా 24 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 293 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లకు గానూ 48.4 ఓవర్లలో 268 పరుగుల వద్ద ఆల్ ఔట్ అయ్యింది. అత్యధికంగా విరాట్ కోహ్లీ 123 పరుగులు చేసి టీమ్‌కు అండగా నిలిచాడు. అయినా ఓటమి తప్పలేదు.
భారత్ స్కోర్ వివరాలు : శర్మ : 3, థావన్ : 32, కోహ్లీ : 123, రహానే : 7, రైనా : 18, కెప్టెన్ ధోనీ : 40, జడేజా : 0, ఆశ్విన్ : 12, కుమార్ : 6, ఇషాంత్ శర్మ : 5, షమీ (నాటౌట్) : 7, ఎగట్రాస్ : 15.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన న్యూజిల్యాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసి, 293 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది.
న్యూజిల్యాండ్ స్కోర్ వివరాలు : గుప్తిల్‌-8, రైడర్‌-18, విలియమ్‌సన్‌-71, టేలర్‌-55, మెక్‌కల్లమ్‌-30, అండర్సన్‌-68 నాటౌట్‌, రాంచీ : 30, ఎన్ఎల్ మెకల్లామ్ : 2, సౌతీ (నాటౌట్) : 3, ఎక్స్‌ట్రా : 7.


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...