నెల్లూరు,జనవరి 5: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జిఎస్ ఎల్ వి-డి5 రాకెట్ ను ఆదివారం సాయంత్రం 4:18 గంటలకు విజయవంతం గా ప్రయోగించారు. ఈ రాకెట్ ద్వారా జిశాట్ -14 సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగించారు. భారత అంతరిక్ష ప్రస్థానంలో ఇది మరో కీలక ప్రయోగం . ఈ ప్రయోగాన్ని గతేడాది ఆగస్టు 19నే చేపట్టాల్సి ఉండగా, రాకెట్ రెండో దశలో ఇంధన లీకేజీ కారణంగా ఆఖరి గంటలో వాయిదా పడింది. ఇస్రో ఇంతవరకూ ఏడు జీఎస్ఎల్వీ ప్రయోగాలు చేపట్టింది. రెండే విజయవంతం అయ్యాయి. జీఎస్ఎల్వీ రాకెట్లో కీలక దశ అయిన అప్పర్ క్రయోజెనిక్ దశను ఇస్రో స్వదేశీయంగానే తయారుచేసింది. జీఎస్ఎల్వీ డీ-5 పొడవు: 49.13 మీటర్లు,,, బరువు: 414.75 టన్నులు ...ప్రయోగం ఖర్చు: రూ.205 కోట్లు (రాకెట్కు రూ.160 కోట్లు, ఉపగ్రహానికి రూ.45 కోట్లు) ... జీశాట్-14 బరువు:1,982 కిలోలు... పనిచేసే కాలం: 12 ఏళ్లు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment