న్యూఢిల్లీ, డిసెంబర్ 8 : ఢిల్లీ ప్రజలు తమకు అందించిన విజయాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదిస్తున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాప అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కైవసం చేసుకుని, ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్పై 20 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ, ఇది చరిత్రాత్మక విజయమని, అవినీతికి, అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు అని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో అవినేతీ ప్రధానాంశమైందని అన్నారు. రాజకీయ ఉద్దండులను సామాన్యుడు దెబ్బతీశాడని కేజ్రీవాల్ అన్నారు. అవినీతి, ధరల పెరుగుదలకు తాము వ్యతిరేకమని , అందుకే ప్రజలు పట్టం కట్టారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. సమర్థవంతంగా ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు తాము సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment