డర్బన్, డిసెంబర్ 8: వరసగా రెండో వన్డేలోనూ ఓటమితో భారత్ మూడు వండేల సీరీస్ ను దక్షిణాఫ్రికాకు సమర్పించుకుంది. ఆదివారం రెండో వన్డేలో భారత్ 134 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్దింగ్ ఎంచుకోవడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సఫారీలు 281 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ముందుంచారు. దీంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియాకు ఆదిలోనే చుక్కెదురైంది. శిఖర్ థావన్ (0) కే వెనుదిరగడంతో భారత్ పతనం ప్రారంభమైంది. మిగతా భారత్ ఆటగాళ్లు కోహ్లి (0), రోహిత్ శర్మ(19),ధోని(19), జడేజా (26), సురేష్ రైనా(36) పరుగులు చేశారు. భారత్ 35.1ఓవర్లలో 146 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో త్సోసిబా నాలుగు వికెట్లు తీసి భారత్ పతనాన్ని శాసించగా, స్టెయిన్ కు మూడు, మోర్కెల్ కు రెండు వికెట్లు దక్కాయి.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment