Tuesday, December 31, 2013

కేబినెట్ లో కీలక మార్పు:శైలజానాథ్ కు శాసన సభా వ్యవహారాలు

హైదరాబాద్, డిసెంబర్ 31: రాష్ట్ర కేబినెట్ లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకూ శాసన సభా వ్యవహారాల శాఖ బాధ్యతలు చూస్తున్న శ్రీధర్ బాబును ఆ శాఖ నుంచి తప్పించి   మంత్రి శైలజా నాథ్ కు అప్పగించారు.  ఇంతవరకు సి.ఎం. చేతిలో ఉన్న శ్రీధర్ బాబును  వాణిజ్య పన్నుల శాఖను  శ్రీధర్ బాబుకు  అప్పగించారు.   రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో కేబినెట్ లో అకస్మిక మార్పు విమర్శలకు తావిస్తోంది. సమైక్య నినాదం వినిపిస్తున్న శైలజా నాథ్ కు శాసన సభా వ్యవహారాల శాఖను అప్పగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలుగు భాషాభివృద్ధి శాఖ ను  వట్టి వసంత్ కుమార్‌కు అప్పగించారు.
 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...