Friday, October 4, 2013

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

న్యూఢిల్లీ, అక్టోబర్ 4 : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, చత్తీస్‌గడ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. చత్తీస్‌గడ్‌లో రెండు దశల్లో పోలింగ్ జరుగుతుంది.  నవంబర్ 11న తొలిదశ, 19న రెండో దశ పోలింగ్ జరుగుతుందని ఈసీ తెలిపింది. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఒక దశలోనే పోలింగ్ జరుగుతుందని, మధ్యప్రదేశ్‌లో నవంబర్ 25న , రాజస్థాన్‌లో డిసెంబర్ 1న , ఢిల్లీ, మిజోరాంలలో డిసెంబర్ 4న పోలింగ్ జరుగుతుందని ఈసీ ప్రకటించింది. ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...