హైదరాబాద్, అక్టోబర్ 4 : కేంద్ర కేబినెట్లో నోట్ ఆమోదం పొందినంత మాత్రాన రాష్ట్ర విభజన జరగదని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్బాబు పేర్కొన్నారు. అసెంబ్లీలో తీర్మానం రావాలి, పార్లమెంట్లో బిల్లు పాస్ అవ్వాలని అన్నారు. అంచేత అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు అసెంబ్లీలో ముసాయిదాను అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్ర ప్రజలు ఆందోళనలో ఉన్నారని, ఇప్పటికైనా మించిపోయింది లేదని, సమ్మెకు దూరంగా ఉన్నవాంతా ప్రజలకు మద్దతు ఇస్తూ, తమతో కలిసి రావాలని అశోక్బాబు పిలుపునిచ్చారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉద్యమంలోకి రావాలని అన్నారు. సమ్మెను కొనసాగిస్తామని అశోక్బాబు స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులు రాజీనామాలు చేశామని నాటకాలు ఆడుతున్నారని, ఎవరూ రాజీనామాలు చేయలేదని ఆయన మండిపడ్డారు. ఈనెల 6న ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment