Friday, October 4, 2013

ఆమరణ దీక్షకు జగన్ సన్నద్ధం..

హైదరాబాద్ , అక్టోబర్ 4:  పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ ను ఇంత దారుణంగా విభజిస్తుంటే దేశం మొత్తం చూస్తూ ఊరుకుందని, రాష్ట్రమంటే అంత చులకనా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన రెడ్డి ప్రశ్నించారు.  రాష్ట్రాన్ని విభజించాలంటే అసెంబ్లీ తీర్మానం తప్పనిసరన్న చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్లు విభజిస్తే రేపు కృష్ణా ఆయకట్టులో అనేక గొడవలు రోజూ జరుగుతాయని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా ఆయకట్టు అంటే కేవలం అవతలివైపున్న జిల్లాలు మాత్రమే కాదని, ఇవతలవైపు మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలు కూడా ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. పదేళ్లలో హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలంటున్నారని, హైదరాబాద్ నగరాన్ని నిర్మించడానికి 60 ఏళ్లు పట్టినప్పుడు కేవలం పదేళ్లలో మరో హైదరాబాద్ లాంటి నగరాన్ని అక్కడ నిర్మించగలరా అని జగన్ నిలదీశారు. విభజనకు వ్యతిరేకంగా తాను రేపటినుంచి చేపట్టబోతున్న ఆమరణ నిరాహార దీక్షకు అన్ని పార్టీలూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...