హైదరాబాద్, సెప్టెంబర్ 6: హైదరాబాద్ను వదులు కోవడానికి సీమాంధ్రులు సిద్ధంగా లేరని కేంద్ర జౌళిశాఖ మంత్రి, కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం నేపథ్యంలో కేంద్రం పునరాలోచనలో పడిందని చెప్పారు. తెలంగాణ నోట్ కేబినెట్ ముందుకు ఇప్పట్లో రాదని, వైద్యం కోసం విదేశాలకు వెళ్లిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దేశానికి వచ్చాక సీమాంధ్ర ఉద్యమానికి అనుకూలంగా ప్రకటన వస్తుందని తెలిపారు. సీమాంధ్ర ఉద్యమ్మ్మ న్యాయమైనదని, సీమాంధ్ర ప్రజల సెంటిమెంటును కాంగ్రెస్ అధిష్టానం అర్థం చేసుకుంటోందని తెలిపారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ఆ ప్రాంత కేంద్రమంత్రులు, ఎంపీలతో కలిసి కాంగ్రెస్ అధిష్టానం ముందు సమైక్యవాదం వినిపించినట్లు కావూరి తెలిపారు. త్వరలో ఆంటోని కమిటీ హైదరాబాదుకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment