ముంబై, సెప్టెంబర్ 4: రోజురోజుకు దిగజారిపోతున్న రూపాయి బుధవారం కాస్త
పుంజుకుంది. రిజర్వ్ బ్యాంకు కొత్త గవర్నర్గా రఘురామ్ రాజన్ బాధ్యతలు
చేపట్టిన నాడే రూపాయి బలపడటం కొత్త ఆశలు రేపింది. ప్రపంచ ఆర్థిక
మేధావుల్లో ఒకరిగా పేరు పొందిన రాజన్.. మన దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర గడ్డు
పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో గవర్నర్గా బాధ్యతలు
స్వీకరించారు. మంగళవారం తో పోల్చితే బుధవారం ఉదయం కూడా
ట్రేడింగ్ లో బుధవారం నాడు రిజర్వ్ బ్యాంకు కొత్త గవర్నర్గా బాధ్యతలు
చేపట్టిన రఘురామ్ రాజన్ డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ 92 పైసలు
పడిపోయి 68.55 స్థాయికి చేరుకుంది. అయితే సాయంత్రానికి 66.82 రూపాయలకు
బలపడింది.
కాగా, రూపాయి విలువ బలపడటంతో బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర 1084 రూపాయలు తగ్గి 33,355 రూపాయలకు చేరింది. కిలో వెండి ధర 2,778 రూపాయలు తగ్గి 54,530 రూపాయలకు చేరింది.
మరోవైపు ఈరోజు స్టాక్ మార్కెట్లు కూడా బుధవారం భారీ లాభాలు నమోదు చేశాయి. సెన్సెక్స్ 333 పాయింట్ల లాభంతో 18,567 పాయింట్లుగా, నిఫ్టీ 106 పాయింట్ల లాభంతో 5,448 పాయింట్లుగా ఉంది.
కాగా, రూపాయి విలువ బలపడటంతో బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర 1084 రూపాయలు తగ్గి 33,355 రూపాయలకు చేరింది. కిలో వెండి ధర 2,778 రూపాయలు తగ్గి 54,530 రూపాయలకు చేరింది.
మరోవైపు ఈరోజు స్టాక్ మార్కెట్లు కూడా బుధవారం భారీ లాభాలు నమోదు చేశాయి. సెన్సెక్స్ 333 పాయింట్ల లాభంతో 18,567 పాయింట్లుగా, నిఫ్టీ 106 పాయింట్ల లాభంతో 5,448 పాయింట్లుగా ఉంది.
No comments:
Post a Comment