Wednesday, September 4, 2013

ఆంధ్రకు అన్యాయం చెయ్యం: దిగ్విజయ్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4 : ఆంధ్రాకు అన్యాయం జరగదని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం దిగ్విజయ్‌ను కలుసుకున్న సందర్భంగా  దిగ్విజయ్ మీడియాతో మాట్లాడుతూ,   రెండుసార్లు కాంగ్రెసు పార్టీని గెలిపించిన ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రానికి తాము అన్యాయం చేయబోమని చెప్పారు.  కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, దిగ్విజయ్ సింగ్‌ల మధ్య రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు చర్చకు వచ్చినట్లు సమాచారం.  కాంగ్రెసు పార్టీ విభజన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చునని సి.ఎం. సూచించారని సమాచారం.  కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేతో కూడా కిరణ్  భేటీ ఆయ్యారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...