Sunday, September 29, 2013

తెలంగాణ జన భేరీ-సమైక్య గర్జన విజయవంతం

హైదరాబాద్/కర్నూలు,సెప్టెంబర్ 29: : తెలంగాణవాదులు హైదరాబాద్ లో  సకల జన భేరీ పేరుతో, సమైక్యవాదులు కర్నూలు సమైక్య గర్జన పేరుతో  ఆదివారం నిర్వహించిన రెండు భారీ బహిరంగ సభలు విజయవంతంగా ముగిశాయి. హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో తెలంగాణ సకల జనభేరి సభకు, కర్నూలు  ఎస్టీబీసీ కళాశాల మైదానంలో సమైక్య గర్జన సభకు జనం భారీగా తరలి వచ్చారు. రెండు ప్రాంతాలలో పోటాపోటీగా నిర్వహించిన రెండు సభల ప్రాంగణాలు జనంతో కిక్కిరిసిపోయాయి.

సకల జనభేరీలో  టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తీవ్రస్థాయిలో విమర్శించారు.  ఆంధ్రా వాళ్లు అందరూ తెలంగాణ ద్రోహులే అని అన్నారు.ఆంధ్రా ప్రజలు.. ఆంధ్రా వారే.  తెలంగాణ ప్రజలు.. తెలంగాణే వారే.  ఇక కలిసుండటం అనేది కలలో కూడా జరుగుతాదా ? అని సీమాంధ్ర నాయకులపై  నిప్పులు చెరిగారు. ఆంధ్రాలో పుట్టిన వాడు ఆంధ్రా వాడే కానీ తెలంగాణలో లెక్కరాడని తెలిపారు. రాష్ట్ర విభజనపై సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా రాష్ట్రాన్ని ఆపాలని యత్నిస్తున్నారన్నారు. అక్టోబర్ 7వ తేదీ దాటిన తర్వాత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పని ముగిసినట్లేనని ఆయన తెలిపారు.
ఢిల్లీ పీఠం దద్దరిల్లేలా ఉద్యమ కార్యాచరణ 
 సమైక్య గర్జనలో మాట్లాడిన నేతలు  రాష్ట్రాన్ని విడగొట్టవద్దని కోరారు.  ఏపీఎన్జీఓ సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ ఢిల్లీ పీఠం దద్దరిల్లేలా ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.  కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. హైదరాబాద్ లో సీమాంధ్రులు పెట్టుబడులు పెట్టి అభివృద్ధికి దోహద పడితే..  హైదరాబాద్ నగరంలో సీమాంధ్రులకు భాగస్వామ్యం లేదనడం భావ్యం కాదని అశోక్ బాబు సూచించారు. సమైక్య ఉద్యమాన్ని చులకనగా చేసి మాట్లాడటం సరికాదన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...