హైదరాబాద్, సెప్టెంబర్ 23: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్ సభ సభ్యుడు జగన్మోహన రెడ్డి కి ఎలాగైతెనే ఎట్టకేలకు బెయిల్ లభించింది. నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు జగన్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జగన్ హైదరాబాద్ వదిలి వెళ్లరాదని కోర్టు షరతు విధించింది. అలాగే రెండు లక్షల రూపాయల విలువైన రెండు పూచీకత్తులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. జగన్ తరపు న్యాయవాదులు పూచీకత్తులను సమర్పించిన అనంతరం రేపు మధ్యాహ్నం జగన్ విడుదల కాగలరని భావిస్తున్నారు. 2012 మే 27న అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్ 16 నెలల నుంచి హైదరాబాద్ చంచల్గుడా జైలులో ఉన్నారు. ఈ మధ్యలో పలు సార్లు ఆయన బెయిల్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఇటు తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం, అటు సీమాంధ్రలో సమైక్య ఉద్యమం నేపథ్యంలో జగన్ విడుదల ప్రాధాన్యతను సంతరించుకుంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment