Monday, September 16, 2013

మోపిదేవి వెంకటరమణకు 45రోజుల తాత్కాలిక బెయిల్‌

హైదరాబాద్, సెప్టెంబర్ 16: మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు నాంపల్లి సీబీఐ కోర్టు  45 రోజుల తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసింది. తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్న మోపిదేవి వెంకట రమణారావుకు వైద్య చికిత్సల కోసం మూడు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది సురేందర్‌రావు సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. ఈ మేరకు మోపిదేవి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు విచారించారు.  వాదనలు విన్న న్యాయమూర్తి-  వెంకటరమణకు బెయిల్ మంజూరు చేశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...