న్యూఢిల్లీ,ఆగస్టు 23: రాష్ట్ర విభజన ప్రక్రియపై తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం వెనక్కి పోతుందని అనుకోవడం లేదని. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై హడావిడిగా ముందుకు సాగకపోవచ్చునని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అనంతరం ఆయన శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ, సమన్యాయం చేయాలని తాను సోనియాను కోరినట్లు ఆయన తెలిపారు. హైదరాబాదులాంటి నగరాన్ని నిర్మించుకోవడానికి తరాలు పడుతుందని, హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తేనే సమన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. జల, ఉద్యోగ విషయాల్లో సమన్యాయం జరిగేలా చూడాలని ఆయన అన్నారు. తాను సమైక్యవాదినని, ప్రజలతో ఉంటానని ఆయన అన్నారు. కాంగ్రెసు అధిష్టానం పరిస్థితిని చక్కదిద్దుతుందని ఆయన అన్నారు. సీమాంధ్ర ప్రజల ఆందోళన తీవ్రతను తాను సోనియాకు వివరించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని విభజిస్తే అనేక సమస్యలు వస్తాయని ఆయన అన్నారు. త్వరలో సమన్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు చిరంజీవి చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment