న్యూఢిల్లీ,ఆగస్టు 23: విభజన నిర్ణయం నేపథ్యంలో తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల సీమాంధ్ర ఎంపీలు ఉభయ సభల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పన్నెండు మంది ఎంపీలపై శుక్రవారం సస్పెన్షన్ వేటు పడింది. ఎంపీల సస్పెన్షన్ పై గురువారమే తీర్మానం ప్రవేశ పెట్టినప్పటికీ విపక్షాలు డివిజన్కు వెళ్తామని హెచ్చరించడంతో ఈ రోజు రూల్ 374 ఏ ప్రకారం స్పీకర్ ద్వారా సస్పెన్షన్ వేటు వేశారు. ఈ రోజు రెండుసార్లు సభ వాయిదా పడిన అనంతరం పన్నెండన్నర గంటలకు తిరిగి ప్రారంభమైంది. సభ మొదలుకాగానే కమల్ నాథ్ సభా కార్యక్రమాలు అడ్డుకుంటున్నారని నలుగురు టిడిపి, ఎనిమిది మంది కాంగ్రెసు ఎంపీలపై తీర్మానం ప్రవేశ పెట్టారు. స్పీకర్ వారిని ఐదు రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెండైన వారిలో టిడిపి ఎంపీలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, శివ ప్రసాద్, కొణకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, కాంగ్రెసు ఎంపీలు హర్ష కుమార్, లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్, అనంత వెంకట్రామి రెడ్డి, సాయి ప్రతాప్, కనుమూరి బాపిరాజు, రాయపాటి సాంబశివ రావు, మాగుంట శ్రీనివాసులు రెడ్డిలు ఉన్నారు. అనంతరం సభ శనివారానికి వాయిదా పడింది. సభ రేపటికి వాయిదా పడిన అరువాత కూడా టిడిపి ఎంపీలు సభలోనే బైఠాయించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment