న్యూఢిల్లీ,ఆగస్టు 22: సమైక్యాంధ్రకు మద్దతుగా అందరికంటే ముందుగా రాజీనామాను ఆమోదింపజేసుకున్న ఎన్టీఆర్ తనయుడు, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ తదుపరి కార్యాచరణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలుగు రాష్ట్రాన్ని చీల్చేందుకు జరుగుతున్న కుట్రలను నిరసిస్తూ తన రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్న హరికృష్ణ రాష్ట్ర విభజనకు తన బావ ఓకే చెప్పడంతో పార్టీ కట్టబెట్టిన రాజ్యసభ సభ్యత్వానికి గుడ్ బై చెప్పారు. కొంతకాలంగా చంద్రబాబు నాయుడు, హరికృష్ణ మధ్య రాజుకున్న చిచ్చుకు రాష్ట్ర విభజన అంశం ఆజ్యం పోసింది. హరికృష్ణ కొద్ది రోజులుగా పార్టీతో అంటిముట్టనట్టు ఉంటున్నారు. నిన్న జరిగిన సోదరుడు నంమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె వివాహానికి కూడా హరికృష్ణ హాజరు కాలేదు. ఈ వివాహానికి జూనియర్ ఎన్టీఆర్ కు అసలు ఆహ్వానమే అందలేదన్న ప్రచారమూ జరుగుతోంది. ఇప్పుడు ఎంపీ పదవిని వదులుకున్న హరికృష్ణ- టీడీపీలో కొనసాగుతారా, అన్న తెలుగుదేశం పార్టీని పునరుద్దరిస్తారా అనేది లేక సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగస్వామి అవుతారా అని చర్చ జరుగుతోంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment