హైదరాబాద్,ఆగస్టు 17: సీమాంధ్ర ఉద్యోగులు చేపట్టిన సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం ‘నో వర్క్-నో పే’ అస్త్రాన్ని ప్రయోగించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ తెలంగాణ ఉద్యోగుల చేపట్టిన సకల జనుల సమ్మెపై 2011లో ప్రయోగించిన జీవో-177ను ఇప్పుడు సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె పై ప్రభుత్వం ప్రయోగించింది. జీవో-177ను ఖచ్చితంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోను అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల హాజరు నివేదికను ప్రతిరోజూ సచివాలయానికి పంపించడంతో పాటు సమ్మె చేస్తున్న ఉద్యోగులపై జీవో-177 ప్రకారం చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశాల్లో స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్ర ట్రెజరీ అండ్ అకౌంట్స్, పే అండ్ అకౌంట్స్, రాష్ట్ర వర్క్స్ ప్రాజెక్ట్స్ అండ్ అకౌంట్స్, ట్రెజరీ విభాగాల సబార్డినేట్ సర్వీసెస్లలో సమ్మెను నిషేధిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వి.భాస్కర్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ సేవలను అత్యవసర సేవల పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని, ఆరు నెలల పాటు సమ్మె నిషేధం అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment