Friday, August 16, 2013

అక్టోబర్ నాటికి రెండు పి.సి.సి.లు...!

హైదరాబాద్,ఆగస్తు 17:  రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తికాక ముందే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ)ని రెండు భాగాలుగా విభజించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. అందులోభాగంగా అక్టోబర్ నాటికి తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ కమిటీలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. రాబోయే సాధారణ ఎన్నికల నాటికి ఇరు ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పటికీ హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తామని కాంగ్రెస్ ప్రకటించినందున గాంధీభవన్‌లోనే తెలంగాణ, ఆంధ్రా పీసీసీ కమిటీలకు కార్యాలయాలను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం గాంధీభవన్‌ను ఆధునీకరించడంతోపాటు వెనకున్న స్థలంలో మూడంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు.   కొత్త భవనాన్ని తెలంగాణకు కేటాయించేలా మార్పులు చేయాలని భావిస్తున్నారు. కొత్త పీసీసీ కమిటీల్లో ఎంతమంది ఆఫీస్ బేరర్స్ ఉంటారనే దానిపై స్పష్టత రాలేదు. ప్రస్తుత ఆఫీస్ బేరర్స్‌లో ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శులంతా కలిపి 30 మంది ఉన్నారు. వీరిలో 16 మంది తెలంగాణ, 14 మంది సీమాంధ్ర వారు. రెండు నెలల క్రితమే వీరి నియామకం జరిగింది. ఈ నేపథ్యంలో ఏ ప్రాంతం వారిని ఆ ప్రాంత పీసీసీ ఆఫీస్ బేరర్స్‌గా కొనసాగిస్తారా, లేక అందరినీ తప్పించి కొత్త కమిటీలను నియమిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. 19న ఢిల్లీ వెళ్లనున్న బొత్స.. రెండు పీసీసీల ఏర్పాటు అంశాన్ని కూడా హైకమాండ్ పెద్దలతో చర్చించే అవకాశాలున్నాయని పీసీసీ వర్గాలు తెలిపాయి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...