హైదరాబాద్, ఆగస్టు 4: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అధిష్టానాన్ని కోరడంతో పాటు అదే సమయంలో సీమాంధ్రలో పార్టీకి నష్టం కలగకుండా సమైక్యోద్యమంలో పాల్గొనాలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. ఈ ఉద్యమంలో పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు మంత్రులు శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు, ఆనం రామానారాయణరెడ్డి, కొండ్రు మురళీలతో కమిటీ ఏర్పాటయింది. మరో 10 మంది మంత్రులు ఈ కమిటీకి సహాయంగా పని చేస్తారు. శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం కిరణ్కుమార్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ దాదాపు ఐదున్నర గంటలసేపు భేటీ అయ్యారు. 20 మంది మంత్రులు, 45 మంది ఎమ్మెల్యేలు, 15 మంది ఎమ్మెల్సీలు సమావేశంలో పాల్గొన్నారు. ఏఐసీసీ పరిశీలకులుగా తిరునావుక్కరసు, కుంతియా హాజరయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలంటూ తీర్మానం చేశారు. సీమాంధ్రుల సమస్యలపై రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలో పార్టీపరంగా ఉన్నత స్థాయి కమిటీ వేసినందున సీడబ్ల్యూసీ తీర్మానంపై కేంద్రం తదుపరి చర్యలు చేపట్టకుండా చూడాలంటూ మరో తీర్మానాన్ని ఆమోదించారు. అదే సమయంలో పార్టీ ప్రయోజనాలు కాపాడుకొనేలా ఉద్యమాన్ని నిర్వహించాలని నిర్ణయిస్తూ మూడో తీర్మానం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment