న్యూఢిల్లీ,జులై 13: తెలంగాణ బంతి కాంగ్రెస్ పార్టీలోని అత్యున్నత నిర్ణాయక విభాగమైన వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) కోర్టుకు చేరింది. శుక్రవారం రాష్ట్రమంతా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన కాంగ్రెస్ కోర్ కమిటీ దాదాపు రెండు గంటల పాటు ఈ అంశంపై చర్చించిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ‘‘తెలంగాణ అంశంపై అన్ని రాజకీయ పార్టీలతో, నేతలతో కాంగ్రెస్ ఇప్పటికే అత్యంత విస్తృతంగా సంప్రదింపులు జరిపింది. ఇప్పుడు పార్టీ కోర్ కమిటీ కూడా సమావేశమైంది. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ అభిప్రాయాలను విన్నాం. ఇక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని సమావేశపరిచి నిర్ణయం తీసుకుంటాం’’ అంటూ దిగ్విజయ్ సింగ్ మీడియాకు రెండే ముక్కల్లో విషయాన్ని వివరించి వెనుదిరిగారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ప్రధాని మన్మోహన్ నివాసంలో సోనియాగాంధీ సారథ్యంలో జరిగిన కోర్ కమిటీ భేటీలో సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్, రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, కేంద్ర హోం మంత్రి సుశీల్కుమార్ షిండే, దిగ్విజయ్, గులాం నబీ ఆజాద్లతో పాటు రాహుల్గాంధీ కూడా పాల్గొనడం విశేషం. ఆయన కోర్ కమిటీ భేటీకి రావడం ఇదే తొలిసారి. కోర్ కమిటీ సభ్యుడైన కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం విదేశీ పర్యటనలో ఉండటంతో సమావేశంలో పాల్గొనలేదు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను విడివిడిగా లోనికి పిలిచి వారి నుంచి రోడ్మ్యాప్లను స్వీకరించడంతో పాటు వారి వాదనలు విన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment